మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు దక్కని కొందరు ఆశావహులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారు. తమకు టికెట్ వస్తుందని ఆశించిన కొందరు తీరా టికెట్లు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురికాగా, మరికొందరు మాత్రం సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. సూర్యాపేటలో టీఆర్ఎస్ టికెట్ ఇవ్వనందుకు ఆ పార్టీ నాయకుడు అబ్ధుల్ రహీం తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో స్థానికులు కాపాడారు.
పట్టణంలో 39వవార్డు నుంచి టిక్కెట్ ఆశించిన ఆయన భారీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేశారు. అయితే తనకు కాకుండా చైర్ పర్సన్ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న మొరిశెట్టి సుధారాణికి టికెట్ ఖరారు కావడంతో తీవ్ర మనస్తాపం చెందిన రహీం ఉరివేసుకుని ఆత్మహత్యయత్నానికి పాలడ్డారు. సమయానికి స్థానికులు గమనించి ఆయనను కాపాడారు.