రాజీవ్ రహదారిపై టోల్గేట్ ఫీజులు పెరిగాయి. పెరిగిన టోల్గేట్ ఫీజులు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ తదితర జిల్లాలకు వెళ్లేవారిపై టోల్గేట్ భారం పడనుంది.
పెరిగిన ధరలు ఇలా..
కారు : సింగిల్ ట్రిప్కు రూ. 58, ఒక రోజు పాస్ రూ. 87, నెల పాస్ రూ. 1,740.
ఎల్సీవీ/మినీ బస్సు : సింగిల్ ట్రిప్కు రూ. 117, ఒక రోజు పాస్ రూ. 175, నెల పాస్ రూ. 3,510.
బస్సు/ట్రక్కు : సింగిల్ ట్రిప్కు రూ. 233, ఒక రోజు పాస్ రూ. 349, నెల పాస్ రూ. 6,990.
ఎంఏవీ : సింగిల్ ట్రిప్కు రూ. 583, ఒక రోజు పాస్ రూ. 874, నెల పాస్ రూ. 17,490.