41వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
♦నరేష్ ఆత్మహత్యకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా బంద్కు పిలుపు ♦మహబూబాబాద్ డిపో ముందు ధర్నా ♦డిపోలకే పరిమితమైన బస్సులు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 41వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికుడు నరేష్ ఆత్మహత్యకు నిరసనగా నేడు మహబూబాబాద్ జిల్లా బందుకు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ముందు కార్మికులు, అఖిలపక్ష పార్టీల నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.