కరోనా వైరస్ ప్రభావంతో తెలంగాణలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 19న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు 22 వరకు జరిగాయి. ఆ తరువాత రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో మార్చి 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసారు.
కాగా మిగిలిన పరీక్షలను మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపినప్పటికీ రాష్ట్రంలో లాక్ డౌన్ ఉన్నందున పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏ. సత్యనారాయణ రెడ్డి సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలతో పాటు వాయిదా పడిని మిగతా అన్ని పరీక్షలకు రీ షెడ్యూల్ తేదీలను తర్వలోనే తెలుపుతామని ఆయన తెలిపారు.