మున్సిపల్ ఎన్నికలకు రంగంసిద్ధం.. ఏ క్షణమైనా నోటిఫికేషన్

Update: 2019-10-22 11:36 GMT

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగంసిద్ధమైంది. హైకోర్టు ఆదేశాలతో ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌లను న్యాయస్ధానం కొట్టివేసింది. ఈ మేరకు ఎన్నికలకు ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చంటూ ప్రభుత్వానికి సూచించింది. సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ధర్మాసనం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అన్ని అభ్యంతరాలను సరిచేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమైంది. 

Tags:    

Similar News