ఇసుక మాఫియాపై హైకోర్టు జోక్యం
ఇసుక దందా చేసే వారిపై హైకోర్టు కన్నెర్రజేసింది. ఇసుక క్వారీల మాఫియాపై హైకోర్టు జోక్యం చేసుకుంది.
ఇసుక దందా చేసే వారిపై హైకోర్టు కన్నెర్రజేసింది. ఇసుక క్వారీల మాఫియాపై హైకోర్టు జోక్యం చేసుకుంది. గత నెల 16న పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంథని మండలంలోని వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణపై జారీ చేసిన ప్రొసీడింగ్పై సోమవారం నోటీసులు జారీ చేసింది. కాగా న్యాయవాది గట్టు వెంకట నాగమణి వెంకటాపూర్ గ్రామంలోని మానేరు ఇసుక క్వారీపై కోర్టుకు లేఖ రాశారు. ఇసుక దందా రూ.50 కోట్ల విలువైన ఇసుకను రూ.5 కోట్లకు అప్పగించడంపై వెంకటాపూర్ గ్రామానికి జరుగుతున్న కోట్లాది రూపాయల నష్టాన్ని ఆమె లేఖలో పేర్కొంది.
రైతులతో బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్న వ్యవహారాన్ని, భూగర్భ జలాలు అడుగంటుతుండగా, నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక రవాణా జరపడాన్ని లేఖలో తెలిపారు. కాగా ఈ లేఖను న్యాయస్థానం పిల్గా స్వీకరించిన సోమవారం విచారణ చేపట్టింది. కాగా ఈ కేసులో ప్రతివాదులుగా రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని జిల్లా వరకు 9 మంది అధికారులను,శాఖలను చేర్చింది. ఈ ప్రాతంలో గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న ఇసుక దందాకు సంబంధించి పూర్తి వివరాలు తెలపాని నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా మంథని నియోజకవర్గంలో ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న ఇతర 14 ఇసుక క్వారీల మైనింగ్ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు.