తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల బాట ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మడిహెట్టి ప్రాజెక్టును కాంగ్రెస్ నేతల బృందం పరిశీలించింది. బోటులో ప్రయాణిస్తూ ప్రాజెక్టు పరిస్థితిని కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజల ధనం వృథా చేస్తోందని ... ఆ విషయాలను ప్రజలకు తెలియజేప్పేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను సందర్శిస్తోంది. ప్రాజెక్టు సందర్శనలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ,పొన్నాల లక్ష్మయ్య, షబ్బిర్ అలీ , ఇతర నాయకులున్నారు.