హైదరాబాద్‌లో ఉద్రిక్తంగా మారిన ఆర్టీసీ బంద్‌

Update: 2019-10-19 05:04 GMT

హైదరాబాద్‌లో ఆర్టీసీ బంద్‌ ఉద్రికంగా సాగుతోంది. రాణిగంజ్‌లో బస్సులు డిపోకే పరిమితయ్యాయి. పోలీసుల పహారా మధ్య బస్సులను బయటకు తీసుకువచ్చేందుకు యత్నించగా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

ఎంజీబీఎస్ దగ్గర ఉద్రిక్తతనెలకొన్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బంద్ లోపాల్గొన్న కార్మిక సంఘాలు, వామపక్షాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Tags:    

Similar News