ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా హైదరాబాద్ మగ్ధూం భవన్ నుంచి సీపీఐ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డిని నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి బేగంబజార్కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.