సీఎం మౌనాన్ని రకరకాలుగా ఊహించుకున్నారు..మహిళలపై దాడులు చేయాలంటే భయపడాలి

Update: 2019-12-06 16:20 GMT
Talasani Srinivas Yadav

దిశ హత్యచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ అత్యాచార నిందితులన్ని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోషాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా, నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

దీనిపై మంత్రి తలసాని శ్రీనివాసరావు స్పందించారు. దిశను పాశవికంగా అత్యాచారం ,హత్య చేసిన నిందితులకు తగిన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు. క్రిమినల్ చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఉరుకోదన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌ తర్వాత మహిళలపై అత్యాచారాలు చేయాలని చూస్తే మృగాలకు వణుకు పుట్టాలన్నారు. నిర్భయ ఘటనలో ఏడేళ్లు గడిచిన నిందితులకు ఉరి తీయలేదని, తెలంగాణ పోలీసులు చేసిన చర్యలను అభినందిస్తున్నామన్నారు. 

Full View

Tags:    

Similar News