బీజేపీ గూటికి చేరిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సోమారపు

Update: 2019-07-15 00:56 GMT

రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ భాజపాలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల TRSకు ఆయన రాజీనామా చేశారు. త్వరలో జరగబోయే నగరపాలక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు. తన మద్దతుదారులను కార్పొరేటర్లుగా బరిలో నిలిపి, వారి విజయానికి కృషి చేస్తానని, ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికలైతే స్వయంగా మేయర్‌ స్థానానికి పోటీ చేస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో BJP ఎంపీలు బండి సంజయ్‌, డి అర్వింద్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో లక్ష్మణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. 

Full View


Tags:    

Similar News