లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై వెంకటేష్

Update: 2019-10-10 15:44 GMT

అవినీతిని అరికట్టాల్సిన ఓ పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నాగర్ కర్నూల్ జిల్లా తేలకపల్లి ఎస్సై వెంకేటేష్ వేలంపాటలో పశువుల సంతను దక్కించుకున్న పరమేష్ ను నెలకు 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత మొత్తంలో డబ్బు ఇచ్చుకోలేనని పరమేష్ చెప్పాడు. అయినా వత్తిడి చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. ఎస్సై వెంకటేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. 

Tags:    

Similar News