టీఆర్ఎస్ పార్టీలో నిజాయితీగా పని చేసినందుకు సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం కల్పించారన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. రాష్ట్ర కేబినెట్లో తనకు మంత్రిగా అవకాశం కల్పించడంపై ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి పోర్ట్ పోలియో ఇచ్చినా నిజాయితీగా పని చేసి సమర్ధతను నిరూపించుకుంటానన్నారు. తనకు ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిలో మొట్టమొదటిసారిగా మహిళకు మంత్రిగా అవకాశం కల్పించడం, గిరిజన మహిళ అయిన తనకు ఈ ఘనత ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.