భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా సమీక్షా సమావేశానికి హాజరయిన మంత్రి పువ్వాడ అజయ్ను అడ్డుకునేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
మంత్రితో పాటు సమావేశం కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.