కాసేపట్లో సీఎం కేసీఆర్తో ఆర్టీసీ కార్మికుల భేటీ
-ప్రగతిభవన్లో సమావేశం కానున్న కార్మికులు -ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా కార్మికులు
ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ కాసేపట్లో ప్రగతిభవన్లో సమావేశం కానున్నారు. ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా సిబ్బంది సహా ఐదుగురు చొప్పున మొత్తం 97 డిపోల నుంచి కార్మికులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అయితే ఇప్పటికే వారు ప్రగతిభవన్కు చేరుకున్నారు. కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరిన తర్వాత వారితో సమావేశమవుతానని గత క్యాబినెట్ సమావేశానంతరం ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ మాట ప్రకారం వారిని ప్రగతిభవన్కు పిలిపించుకొని కూలంకషంగా మాట్లాడనున్నారు.