నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ కొండ చిలువ కలకలం రేపింది. దాదాపు 6 మీటర్లు ఉన్న కొండ చిలువను చూసి స్థానికులు, విద్యార్థులు భయపడిపోయారు. వెంటనే స్కూల్ యాజమాన్యం అటవీ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ ప్రొటెక్షన్ టీం వచ్చి ఆ భారీ కొండచిలువను చాకచాక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని మల్లారం అటవీ ప్రాంతంలో వదిలేశారు అటవీ సిబ్బంది. కొండచిలువను పట్టుకున్న వారిలో ఉత్తర రేంజ్ అటవీ అధికారి బాబూరావు, స్నేక్ ప్రొటెక్షన్ సభ్యులు ఉన్నారు.