రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలో మద్యంతాగి పట్టుబడ్డ యువకులను పోలీసులు చితకబాదారు. మద్యం సేవించి వాహనం నడుపుతారా అంటూ బూతులు తిట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ తతంగాన్ని అంతా వీడియో తీసిన స్థానికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. పోలీసులు తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.