అది ఏనుగు పిల్ల కాదు...

బ్రహ్మంగారు కాల జ్ఞానంలో చెప్పినట్టుగానే ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని వింత సంఘటనలు జరుగుతున్నాయి.

Update: 2019-10-31 09:49 GMT

బ్రహ్మంగారు కాల జ్ఞానంలో చెప్పినట్టుగానే ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని వింత సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కూడా అలాంటి ఒక వింత సంఘటన జరిగింది. అది ఏంటి తెలుసుకోవాలనుందా...!

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్‌ పల్లి అనే ఊర్లో ఓ పందికి రెండు పిల్లలు పుట్టాయి. ఆ పంది పిల్లలు చూడడానికి అచ్చం ఏనుగు పిల్లలాగే తొండంతో ఉన్నాయి. ఈ విషయాన్ని గమనిచిన గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ పిల్లలను చూడడానికి గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఆ పంది పిల్లలు చూడ్డానికి ఏనుగు పిల్లల్లా ఉన్నాయని, కలియుగంలో ఇలాంటి సంఘటనలే జరుగుతాయని గ్రామంలోని కొందరు వృద్ధులు అంటున్నారు. 2016లో కాంబోడియా, 2014లో చైనాలలో కుడా ఇలాంటి పంది పిల్లలే పుట్టాయని, కేవలం కొన్ని జన్యు లోపాల వల్లే అలాంటి పిల్లలు పుడతాయని మరి కొందరు విద్యా వేత్తలు చెపుతున్నారు.


Tags:    

Similar News