సాయంత్రం సమావేశం కానున్న ఆర్టీసీ జేఏసీ

Update: 2019-11-24 02:54 GMT
అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీ సమ్మె 51 వ రోజు కొనసాగుతోంది. నిరసనలో భాగంగా ఇవాళ హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో పెద్దఎత్తున మహిళ కార్మికులు శాంతియుత దీక్ష చేస్తారు. మరో వైపు రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు ఆర్టీసీ అమరవీరులకు కార్మికులు నివాళులు అర్పిస్తారు. తర్వాత డిపోల ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేస్తారు.ఎలాంటి షరతులు లేకుండా నాలుగు రోజులు నుంచి విధుల్లో చేరుతామంటున్న సర్కార్ నుంచి స్పందన లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సాయంత్రం ఆర్టీసీ జేఏసీ సమావేశం కానుంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది.  

Tags:    

Similar News