కొనసాగుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌

♦ బస్‌ డిపోల దగ్గర డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డికి నివాళి అర్పిస్తున్న కార్మికులు ♦ కొత్తగూడెం డిపో ఎదురుగా యోగా చేసిన నిరసన వ్యక్తం చేసిక కార్మికులు

Update: 2019-10-14 04:25 GMT

ఆర్టీసీ కార్మికులు వారి హక్కుల సాధన కోసం చేస్తున్న సమ్మె నేటికి 10వ రోజుకు చేరుకుంది. ఈ ఉధ్రిక్త వాతావరణంలో ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ కొనసాగుతోంది.

డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు నివాళి అర్పించేందుకు ఉదయం నుంచే డిపోల దగ్గరకు కార్మికులు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం ఏరియాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కొత్తగూడెం బస్‌ డిపో ఎదురుగా కార్మికులు వినూత్న రీతిలో యోగా చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని. వారి డిమాండ్లను నెరవేర్చాలని కార్మిక సంఘాలు కోరుకుంటున్నాయి.

Tags:    

Similar News