సౌదీ అరేబియాలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. మూడేళ్ల క్రితం కుటుంబ పోషణ కోసం గల్ఫ్కు వెళ్లిన నయీం ఉద్దీన్ నెల రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. అయితే నయీం మృతదేహం ఇండియాకు పంపాలని అతడి కుటుంబ సభ్యులు సౌదీ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అయితే ఫలితం లేదు. దీంతో నయీం మృతదేహం కోసం భార్యాపిల్లలు ఎదురుచూస్తున్నారు. సౌదీలోనైనా అంత్యక్రియలు జరపండి.. లేకుంటే మృతదేహాన్ని ఇండియాకు పంపాలని కోరుతున్నారు.