హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Update: 2019-11-16 10:56 GMT
ప్రతీకాత్మక చిత్రం

వేగంగా వెలుతున్న కారు క్రేన్లోకి దూసుకుపోవడంతో ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడిని మనీష్‌గా గుర్తించారు. గాయపడిన ముగ్గురిలో ఐశ్వర్య పరిస్థితి విషమంగా ఉంది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న పబ్ లో మద్యం సేవించి కారులో ప్రయాణం చేస్తున్నారు. మద్యం మత్తలో కారు వేగంగా నడిపిస్తున్నారు.

ఈ వేగమే వారి ప్రాణాలను బలి తీసుకుంది. మత్తులో కారు ఎటు నడిపిస్తున్నామో తెలియక నేరుగా క్రేన్లోకి దూసుకెళ్లారు. దీంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా, ముగ్గరు తీవ్రగాయాలపాలయ్యారు.  విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మద్యం మత్తులో కారు అతివేగంగా నడిపించడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలుపుతున్నారు.


దీనిని ఇంగ్లిష్ లో చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ! 



Tags:    

Similar News