రంగారెడ్డి జిల్లా ఎంఆర్వో హత్య తర్వాత కొత్త ఆఫీస్ను ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పలు భవనాలను పరిశీలించిన అధికారులు మరో మూడ్రోజుల్లో కొత్తబిల్డింగ్లోకి మారనున్నట్లు డిప్యూటి ఎంఆర్ఓ కృష్ణయ్య తెలిపారు. నూతన ఎమ్మార్వోగా వెంకట్రెడ్డి శుక్రవారం విధులకు హాజరుకానున్నట్లు చెప్పారు. అబ్దుల్లాపూర్మేట్ నుంచి హయత్నగర్కు మార్చడంపై స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.