హెచ్ఎంటీవీలో ప్రసారమైన "పాపం పసిపాప" కథనానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందన
హెచ్ఎంటీవీ మరోసారి మానవీయతను చాటుకుంది. హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన పాపం పసిపాప కథనానికి ఆపూర్వ స్పందన వస్తోంది. ఎనిమిదేళ్ల వయసులో అవ్వకోసం చిన్నారి దుర్గాభవాని పడుతున్న తపనన పలువురు దాతలను కదిలించింది. హెచ్ఎంటీవీలో ప్రసారమైన కథనాన్ని చూసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చలించి కన్నీరుపెట్టుకున్నారు. వెంటనే చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చి మానవత్వం చాటుకున్నారు. పాప చదువుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పాటు పాపను కలుసుకునేందుకు సిద్ధపూర్కు సిద్ధమయ్యారు. అవ్వకు ఆపరేషన్ చేయించడంతో పాటు వారు ఉండేందుకు ఇళ్లు కూడా కట్టిస్తానని చెప్పారు.