స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకు ప్రతి ఒక్కరూ శ్రీకారం చుట్టాలన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని... అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో మురికి నీరు ఉన్న ప్రాంతాలను గుర్తించాలని... ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కోరారు. సిద్దిపేట రెడ్డి భవన్లో నియోజక వర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు.