ఫౌంటైన్‌ను తలపించేలా ఎగసిపడుతున్న నీళ్లు

Update: 2019-12-08 06:51 GMT
ప్రతీకాత్మక చిత్రం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ల లీకేజ్‌ వరుస కొనసాగుతుంది. తాజాగా మహబూబ్‌నగర్‌ మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్‌ కావడంతో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఫౌంటెన్‌ను తలపించేలా నీరు పైకి ఎగజిమ్ముతోంది. పైప్ లైన్‌కు పెద్ద రంధ్రం పడటంతో నీళ్లు వృథాగా పోతుంది. మరోవైపు నీరు భారీగా ఎగసిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

ఒక్కసారిగా గంగమ్మ పైకి ఎగజిమ్ముతున్న నీటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో అక్కడకి వెళ్లి తిలకించారు. పైగా ఇలాంటి అరుదైన సందర్భం మళ్లీ రాదంటూ స్థానికులు సెల్ఫీలు తీసుకున్నారు. ఫౌంటేన్ మాదిరిగా నీళ్లు బయటకు ఎగజిమ్మడం, అందులోనూ అధిక పీడనంతో దాదాపు రెండు అంతస్తులకు పైగా ఎత్తువరకు నీళ్లు ఎగసిపడటం చూపరులను ఆకట్టుకుంది.





Tags:    

Similar News