కుల వృత్తులకు ప్రోత్సాహం : మంత్రి తలసాని

Update: 2019-10-03 12:35 GMT

తెలంగాణలో కుల వృత్తులకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 5వేల కోట్లతో కోటి 70లక్షల గొర్రెలు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి చెరువు, కుంటలో చేపపిల్లలు వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విజయ డెయిరీ ప్రక్షాళన చేశామని అన్నారు. సబ్సిడీపై గేదెలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో తన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. 

Tags:    

Similar News