అందరూ మట్టి గణనాథులనే పూజించాలి: మంత్రి తలసాని
పర్యావరణాన్ని కాపాడే విధంగా అందరూ మట్టి గణనాథుల్లనే పూజించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
పర్యావరణాన్ని కాపాడే విధంగా అందరూ మట్టి గణనాథుల్లనే పూజించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాగోల్ శుభోదయా అపార్ట్మెంట్స్ లోని వారికి మట్టి వినాయకుళ్ళని తలసాని అందజేశారు. ప్రభుత్వం ఇప్పటికే చాలా చోట్ల మట్టి గణపతుల పంపిణీ చేసిందని.. మట్టి వినాయకుల తో పాటు ఒక చెట్టుని కూడా అందజేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరే గణేశ్ నిమర్జనాలు చేసుకునేలాగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.