దేశవ్యాప్తంగా ఉన్న పార్టీల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రజాదరణ పొందిందని, రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చెందిందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భువననగిరి జిల్లా మోత్కూర్ పురపాలక సంఘం నూతన పాలకవర్గం ఈ రోజున బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అబివృద్ది చెందిందని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు ఎంతగానో విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించిందని అన్నారు.
ఈ విధంగానే టీఆర్ఎస్ పార్టీ దేశంలో సంచలనాన్ని సృష్టించిదని తెలిపారు. సీఎం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనాన్ని ఎగరేసాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్నా రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్నారు.