దావోస్‌కు కేటీఆర్‌..

Update: 2020-01-19 02:47 GMT

ప్రతి ఏడాది నిర్వహించినట్టు గానే ఈ ఏడాది కూడా స్విట్జర్లాండ్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుందని, ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తప్పక హాజరు కావాలని ఫోరం సభ్యులు తెలిపారు. ఈ ఏడాది 50వ వార్షిక సదస్సు కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఆహ్వానం అందుకున్న కేటీఆర్ సోమవారం ధావోస్ కూ బయలుదేరనున్నారు. ఈయనతో పాటు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డిజిటల్‌ మీడియా విభాగం డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం కూడా ధావోస్ కు వెళ్లనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించి రాష్ట్రంలో ఏ విధమైన పెట్టుబడులకు పెట్టొచ్చో వివరించనున్నారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో కేటీఆర్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. సదస్సు ముగిసిన అనంతరం 24న కేటీఆర్‌ హైదరాబాద్‌కు తిరిగి భారత దేశానికి రానున్నారు.

ఇకపోతే కేటీఆర్ 2018లో తొలిసారిగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. 2019లో నిర్వహించిన సదస్సుకు ఫోరం నుంచి ఆహ్వానం అందినా ఆయన హాజరు కాలేకపోయారు. కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో కేటీఆర్‌ ఎన్నికల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన దావోస్‌కు బయలుదేరి వెళ్లితే సీఎం కేసీఆర్‌ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.




Tags:    

Similar News