టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

Update: 2020-03-18 16:05 GMT

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా కేకే, సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీ లేకపోవడంతో ఇరువురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తమకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అంచనాలను అందుకుంటామని కేకే చెప్పారు. ఈ పదవి తనకు ఓ ఛాలెంజ్ అని సురేష్ రెడ్డి అన్నారు. కేకే, సురేష్ రెడ్డి ఎన్నికపట్ల రాష్ర్ట మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News