గవర్నర్గా నరసింహన్కు చివరిరోజున తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో చివరిసారిగా గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వీడ్కోలు పలికేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా గవర్నర్ కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన నరసింహన్ సతీమణి విమలా నరసింహన్ కన్నీరు పెట్టుకున్నారు.