గొల్లపూడి మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్

Update: 2019-12-12 08:26 GMT

సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశనం చేసాయని ముఖ్యమంత్రి అన్నారు. మారుతీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గొల్లపూడి మారుతీరావు కాసేపటి క్రితం తుదిశ్వాసవిడిచారు. చెన్నైలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 250కి పైగా చిత్రాల్లో గొల్లపూడి నటించారు. గొల్లపూడి మరణవార్తతో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Tags:    

Similar News