కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని సర్వం సిద్ధం

Update: 2019-06-21 00:46 GMT

మహత్తర ఘట్టం ఆసన్నమైంది. కాళేశ్వరం బహుళార్థ సాధక ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర మొదటి పూజ, హోమం చేయనున్నారు సీఎం కేసీఆర్.ఉదయం 8.15 గంటలకు కేసీఆర్ మేడిగడ్డ చేరుకుంటారు. 8.30 గంటలకు అక్కడ పూజ నిర్వహిస్తారు. 10.30 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం 10.50 గంటలకు కన్నేపల్లికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. కన్నేపల్లి పంపు హౌస్ వద్ద హోమం నిర్వహిస్తారు. అనంతరం కన్నేపల్లి పంప్ హౌజ్‌ను ప్రారంభిస్తారు.సీఎం కేసీఆర్‌‌తో పాటు.. మహారాష్ట్ర, ఏపీ సీఎంలు, గవర్నర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.

Tags:    

Similar News