సంధ్యారాణి మృతదేహంతో బంధువుల ధర్నా.. మృతురాలి తండ్రిని బూటు కాలితో తన్నిన పోలీస్
సంగారెడ్డి జిల్లా పఠాన్చెరులోని ఓ కాలేజ్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి సంధ్యారాణి మృతదేహాన్ని తరలించారు. ఈ నేపథ్యంలో ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్చురీ తాళం పగలగొట్టి సంధ్యారాణి మృతదేహాన్ని కాలేజ్కు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు మృతురాలి తండ్రిని బూటు కాళ్లతో తన్నారు. ఈ సంఘటనతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమువుతున్నాయి. దీంతో మృతదేహం తరలింపును పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.