ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజు గడువు పొడిగించారని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజు గడువు పొడిగించారని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబరు 29వ తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఉండగా కొన్ని అనివార్య కారణాలవాల్ల నవంబరు 4వ తేదీ వరకూ గడువు తేది పొడిగించినట్టు బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ తెలిపారు.
మార్చి, 2020 సంవత్సరానికి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతోపాటు, సప్లమెంటరి, ప్రైవేట్గా రాసే విద్యార్దులకు ఈ వెసులుబాటు కల్పించినట్టు ఈ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపింది.