ఇప్పటికే పలు మార్గాల్లో మెట్రో రైలు పరుగులు తీస్తోంది.. ఇప్పుడు మరో మార్గానికి మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అమీర్పేట-హైటెక్సిటీ మార్గంలో కమిషనర్ ఆఫ్ మెట్రోరైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) రైళ్లు నడుపడానికి అనుమతిచ్చింది. శుక్రవారం మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అమీర్పేట నుంచి హైటెక్సిటీ వరకు గల పది కిలోమీటర్ల మార్గాన్ని గత ఏడాది సిద్ధంచేశారు. నవంబర్ 27న ట్రయల్న్ ప్రారంభించారు.
ప్రస్తుతం రోజూ ట్రయల్ రన్ జరుగుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ , మాదాపూర్, హైటెక్సిటీ ప్రాంతాల్లో పెద్దఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలామంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. రోజూ తమ ఆఫీసులకు వచ్చివెళ్లేందుకు ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నారు.దీంతో అమీర్పేట్-హైటెక్సిటీ మార్గం లో రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇది చాలా మంది ప్రైవేటు ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.