హుజూర్ నగర్ ఉపఎన్నిక బరిలో ఎంత మంది నిలిచారనే విషయంలో క్లారిటీ వచ్చింది. మొత్తం 76 మంది నామినేషన్లు వేయగా అందులో 45 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ముగ్గురు అభ్యర్ధులు పోటీ నుంచి విరమించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 28 మంది సభ్యులు మిగిలారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 16 మంది బరిలో నిలిస్తే ఈ సారి ఆ సంఖ్య కాస్త పెరిగింది.