సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ దగ్గర రంగనాయక సాగర్ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ప్రారంభించారు. మోటార్ ఆన్ చేసి రంగనాయకసాగర్ జలాశయంలోకి గోదావరి జలాలు విడుదల చేశారు. తొలుత చంద్లాపూర్లోని రంగనాయకస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సొరంగంలోని పంప్హౌజ్ వద్ద పంప్ను ప్రారంభించారు.
2,300 ఎకరాల్లో రూ.3,300 కోట్ల వ్యయంతో మూడు టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్లు పద్మాకర్, సిద్దిపేట సీపీ జోయల్డేవిస్ స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు పాల్గొన్నారు.