టీఆర్టీ నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలంటూ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్రెడ్డిని ఆదేశించింది. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో వచ్చే రెండు రోజుల్లో నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోపు టీఆర్టీ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.