హైదరాబాద్ సనత్ నగర్లో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యానికి ఐదేళ్ల చిన్నారి వికలాంగురాలైంది. గత నెలలో చిన్నారి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ.. ఇంట్లోని కబోర్డ్ కాలు మీద పడింది. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని హుటాహుటిన దగ్గర్లోకి ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అయితే డాక్టర్లు చికిత్స చేయకుండా కాలయాపన చేసి చివరిని నిమిషంలో చేతులెత్తేశారు. దీంతో చిన్నారిని మరో హాస్పిటల్కి తరలించారు తల్లిదండ్రులు.
అయితే మరో ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా వైద్యం చేసి.. ఐదేళ్ల చిన్నారి కాలును తొలగించారు. దీంతో తల్లిదండ్రులు గత నెల 25న వైద్యుల నిర్లక్ష్యంపై సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. పోలీసులు కార్పోరేట్ హాస్పిటల్కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.