పెళ్లి కోసం వేసిన పచ్చని తోరణాలు ఇంకా వాడిపోలేదు. షామియానాలూ తీయలేదు. వచ్చిన బంధువులతో ఇళ్లంతా కళకళలాడుతోంది. అలాంటిది పెళ్లి ఇంట పెను విషాదం జరిగింది.కరెంట్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం ముక్తాపురంలో జరిగింది. పెళ్లి ఇంట అలంకరణకు వేసిన సీరియల్ బల్బులతో విద్యుదాఘాతానికి గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. సాయంత్రం కురిసిన వర్షానికి అలంకరణకు వేసిన విద్యుద్దీపాల నుంచి ఇంటికి కరెంట్ ప్రసరణ జరిగింది. దీ్తో ఒకరిని కాపాడేయత్నంలో మరొకరు కరెంట్ షాక్కు గురై వరుడితో పాటు అతడి తల్లిదండ్రులు, మేనత్త చనిపోయారు. ఈ ఘటనలో వరుడి సోదరుడు భాస్కర్కు స్వల్పగాయాలయ్యాయి. పెళ్లైన రెండ్రోజులకే జరిగిన విషాద ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.