మల్కాజ్గిరిలో భారీ అగ్ని ప్రమాదం.
హైదరాబాద్ మల్కాజ్గిరిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అపార్టుమెంట్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ మల్కాజ్గిరిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అపార్టుమెంట్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో మంటలు చెలరేగాయి. దీంతో రెండు కార్లు, 10 బైక్లో అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సహాయంతో మిగిలిన వాహనాలను బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపం వల్లే మంటలు వ్యాపించినట్టు స్థానికులు చెబుతున్నారు.