బంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణ: వివేక్

తెలంగాణలో తుగ్లక్ పాలన కొనసాగుతోంది. బంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణ. కాంట్రాక్టర్ల మామూళ్ల కోసమే సెక్రటేరియట్‌ భవనాలను కూల్చి వేత

Update: 2019-08-10 03:05 GMT

తెలంగాణలో తుగ్లక్ పాలన కొనసాగుతుందన్నారు మాజీ ఎంపీ వివేక్. బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి తొలిసారి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద అభినమానులు, బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వారినుద్దేశించి మాట్లాడిన వివేక్.. బంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణగా రాష్ట్రం మారిందని విమర్శించారు. కాంట్రాక్టర్ల మామూళ్ల కోసమే సెక్రటేరియట్‌ భవనాలను కూల్చి కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారన్నారు. కేసీఆర్ అవినీతి,కుటుంబ పాలనతో విసిగిపోయిన వివేక్.. బీజేపీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.

Full View

Tags:    

Similar News