మద్యం తాగి వాహనాలు నడుపొద్దని హెచ్చరిస్తున్నా మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. మద్యం తాగి వాహనాలను నడపడం పరిపాటిగా మారింది. ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా, వాహనాలను సీజ్ చేస్తున్నా గానీ పట్టుబడుతున్నారు. వారిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. తాజాగా హైదరాబాద్ లో పలువురు మద్యం తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45, చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో పాటు పలు ప్రాంతాల్లో డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యంతాగి బండి నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే 11 కార్లు, 25 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక డ్రంకన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు చుక్కలు చూపించారు వాహనదారులు.