దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన దిశ అత్యాచారం, హత్యకేసులో నిందితులను కోర్టు పోలీసుల కస్టడీకి అప్పగించింది. దిశ హత్య కేసులపై ఇంకా విచారణ జరపాల్సి ఉందని నిందితులని కస్టడీకి ఇవ్వాలని షాద్నగర్ పోలీసులు కోర్టును విజ్ఞప్తి చేశారు.
దిశ కేసులో నిందితులను రిమాండ్కు తరలించే రోజు పోలీస్ స్టేషన్ వద్ద వేలాది మంది ఉండడంతో నిందితులను పూర్తిగా విచారించలేదని తెలిపారు. నిందుతుల నుంచి మరింత సమాచారం తెలుసుకోవల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో సానుకూలంగా స్పందించిన కోర్టు నిందితులకు 10 రోజుల కస్టడీని విధించింది.