సీనియర్ పొలిటీషియన్ ధర్మపురి శ్రీనివాస్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ డీఎస్కు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బీజేపీలోకి చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ అధిష్టాన నేతలతో డీఎస్ భేటీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ సభ్యత్వం కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లలో డీఎస్ ఫోటోలు దర్శనమివ్వడం తీవ్ర చర్చకు దారి తీసింది.