రంగారెడ్డి జిల్లా మజీద్పూర్లో బావిలో పడ్డ జింక
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మజీద్పూర్లో ఓ జింక ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మజీద్పూర్లో ఓ జింక ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. కుక్కలు తరమడంతో పరిగెత్తుకుంటూ వచ్చిన జింక... వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో పడి రాళ్ల మధ్య ఇరుక్కుపోయింది.
దీన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని పోలీసుల సాయంతో జింకను బావి నుంచి వెలికి తీశారు.