జైపాల్ రెడ్డి పార్ధివ దేహానికి కాంగ్రెస్ నేతల నివాళులు ..

Update: 2019-07-28 02:45 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆకస్మిక మృతిని... కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి... పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చి... జైపాల్ రెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డ్ పొందిన జైపాల్ రెడ్డి... ఎంతో చక్కగా ప్రసంగించేవారనీ, ఆయన ప్రసంగాలు వినేందుకు ఎంతో ఆసక్తి చూపించేవాళ్లమని కొందరు అంటున్నారు. ఎమర్జెన్సీ సమయంలో తప్ప మిగతా సమయమంతా కాంగ్రెస్‌కే సేవలందించారనీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జైపాల్ రెడ్డి తన వంతు కృషి చేశారని మరికొందరు నేతలు గుర్తుచేసుకుంటున్నారు.

Tags:    

Similar News