'ఎవరెవరు ఓడిపోతారో... టీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఎలా చెప్పగలిగారు' : తెలంగాణ కాంగ్రెస్
ఈవీఎంలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఉద్యమబాట పట్టింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటూ ధర్నా చౌక్లో నిరసన ప్రదర్శన చేపట్టిన మహా కూటమి నేతలు.... పార్లమెంట్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కంటే ముందుగా... ఎవరెవరు ఓడిపోతారో... టీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. ఎన్నికలు ముగిశాక... ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ను కేసీఆర్ కలవడంపైనా మహా కూటమి నేతలు అనుమానాలు వ్యక్తంచేశారు.